తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్కు లాంఛనంగా స్టార్ట్ ఇచ్చి, ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మధ్య వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రకు త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు టాక్ వస్తోంది. అయితే ఆమె ప్రధాన కథానాయిక కాదని, రెండో హీరోయిన్ పాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది. ఈ విషయం అధికారికంగా ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. అలాగే ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో టీమ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా మమితా బైజు నటిస్తుండగా, సంగీత బాధ్యతలు జి.వి. ప్రకాష్ కుమార్ చేపట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్ ఈసారి ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
