పాప ప్లానింగ్‌ మామూలుగా లేదుగా..!

Thursday, September 19, 2024

మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె నటించిన ఫస్ట్‌ మూవీ  కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు… కానీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైంది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో జిక్కి అనే పాత్రలో నటించింది భాగ్యశ్రీ.

అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మతో కలిసి రవితేజ వేసిన డాన్స్ స్టెప్పులు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేసింది చిత్ర బృందం. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పోస్టర్ల మీద కూడా ఆమెకు సింహభాగం దక్కిందని చెప్పాలి.అలాంటి భామ తాజాగా మీడియాతో వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విశేషాలను మీడియాతో పంచుకుంది..

ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కదా భవిష్యత్తులో పాట పాడే అవకాశం ఉందా అని యాంకర్‌ అడిగితే..కచ్చితంగా పాడతా అని..తనకు పాడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అది మాత్రమే కాకుండా తాను ఇదే ఇండస్ట్రీలో ఉంటానని భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిర్మాతగా కూడా మారతానని ఆమె చెప్పుకొచ్చింది.

ఆమె మాటలు వింటుంటే..ఆమె అంత ఈజీగా ఏమీ టాలీవుడ్‌ లోకి రాలేదు..ఏదో గట్టి ప్లాన్ తోనే ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ సెటిలైపోవాలని దర్శకత్వం నిర్మాణాల సైతం చేయాలని ఫిక్స్ అయిపోయందనే అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles