అతిలోక సుందరికి మరో అరుదైన గౌరవం!

Wednesday, March 26, 2025

దివంగత నటి, ఆలనాటి అందాల తార  శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది.  ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా పేర్కొంది. అయితే, గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.

శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు నివసించే వారని, శ్రీదేవి మరణించిన అనంతరం అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కాగా, గతంలో శ్రీదేవి జ్ఞాపకార్ధం ముంబైలో ఓ ఫ్లై ఓవర్‌కి ‘అభినేత్రి శ్రీదేవి ఉదాన్‌పూల్’ అని పేరు పట్టాలని బీజేపీ కార్పొరేటర్ మోగిరాజ్ లేఖ రాశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles