వీరమల్లు కోసం రేవంత్‌ ని కలవనున్న ఏఎం రత్నం!

Sunday, January 18, 2026

టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి “హరిహర వీరమల్లు” సినిమా పై ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తుండగా, అభిమానులు దీనికి గట్టి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమాకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం, తెలంగాణలో టికెట్ ధరలు పెంపు చేయడం, అదనపు షోలకు అనుమతులు ఇచ్చే విషయంపై అధికారిక ప్రకటన బయటకి వచ్చింది. నిర్మాత ఏ ఎం రత్నం ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాక, నైజాంలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభం కావచ్చని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత అధికారికంగా రానుంది.

ఈ భారీ ప్రాజెక్ట్ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, జూన్ 12న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, సినిమా ప్రీ రిలీజ్ బజ్ ను చూస్తే సినీ ప్రేమికులందరికీ ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అన్ని అనుమతులు దొరికితే, ఇది సమ్మర్ లో టాలీవుడ్ కి మరొక హిట్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles