మోడీతో అక్కినేని కుటుంబం!

Saturday, January 10, 2026
అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తాజాగా న్యూ ఢిల్లీలోని పార్లమెంట్‌లో భారత ప్రధాని మోడీని కలిశారు. ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు ఇండియన్ సినిమాకు చేసిన సేవలను మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోడీకి తమ కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

ఈ క్రమంలోనే అక్కినేని  నాగేశ్వర్ రావు పై బయోగ్రఫీ బుక్‌ని మోడీ ఆవిష్కరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని వ్యక్తిత్వ కా విరాట్’ అనే పుస్తకాన్ని మోడీ ఈ సందర్భంగా లాంచ్ చేశారు. ఇక నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత, నాగసుశీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles