టాలీవుడ్లో ఓ టైమ్కి టాప్ హీరోయిన్గా దూసుకెళ్లిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బుట్టబొమ్మ, కొంతకాలంగా వరుస ఫ్లాపులతో వెనక్కి పడిపోయింది. దాంతో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆమె తెలుగులో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కూడా మిస్ అయ్యారు.
ఇక ఇప్పుడు పూజా హెగ్డే తమిళంలో మళ్లీ అవకాశాలు అందుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే ఆమె ఓ తమిళ్ క్రేజీ ప్రాజెక్ట్కి అంగీకరించినట్టు టాక్ వచ్చిందంటే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన పూజా నటించబోతున్నట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ డెబ్యూట్ డైరెక్టర్ తెరకెక్కించబోయే సినిమాలో సల్మాన్ పూజా జోడీగా కనిపించనున్నారట. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందనే బజ్ వినిపిస్తోంది.
ఇక మరోవైపు పూజా హెగ్డే పేరు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. రేపే ఆ స్పెషల్ సాంగ్ రిలీజు కానుందని సమాచారం. ఇలా పూజా హెగ్డే మళ్లీ బిజీ అవుతూ దూసుకెళ్లే ట్రాక్కి వచ్చిందని చెప్పుకోవాలి.
