దర్శక ధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, తాజాగా హీరో నాని ఈ సినిమా విడుదల పై ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హిట్-3’ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ.. ‘రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ఇంకో ఏడాదిలో రాబోతోందని, సినిమాను ప్రపంచమంతా చూసి తీరాల్సిందేనని నేచురల్ స్టార్ నాని అన్నారు.
ఏది ఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం.
అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశానని వివరించారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.
