డబుల్ బ్లాస్ట్ కి అంతా రెడీ!

Friday, December 5, 2025

విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సంక్రాంతి సినిమా థియేటర్స్ లో సెన్సేషనల్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా బుల్లితెరలపై ఎంటర్టైన్ చేసేందుకు వస్తుంది.

ఒక పక్క టీవీ టెలికాస్ట్ కి ఇంకోపక్క జీ5 లో ఓటిటి స్ట్రీమింగ్ కి కూడా ఈ చిత్రం నేడు మార్చ్ 1 సాయంత్రం 6 గంటల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనితో ఈరోజే సంక్రాంతికి వస్తున్నాం డబుల్ బ్లాస్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం ఆడియెన్స్ వీటిలో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండిట్లో కూడా ఈ చిత్రం ఎలాంటి స్పందన కొల్లగొడుతుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles