ఈ సారి బాహుబలిలో అది లేదంట..!

Friday, November 14, 2025

ఇటీవలి కాలంలో సినిమా టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబంతో వెళ్లి సినిమా చూడడం సాధారణం కాగా, ఇప్పుడు టికెట్ రేట్లు పెరగడంతో చాలామంది ఆలోచించాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ మొదలైనది దర్శకుడు రాజమౌళి సినిమాల విజయాల తర్వాతనే అని చాలామంది అంటున్నారు. ఆయన చిత్రాల స్థాయి, విజువల్స్ చూసి అభిమానులు ఎక్కువ ధరలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే విధంగా టికెట్ రేట్లు పెంచడం మొదలుపెట్టాయి. దాంతో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లే ముందు రెండుసార్లు ఆలోచిస్తున్నాడు.

ఇప్పుడు రాజమౌళి మళ్లీ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ లెజెండరీ సినిమాను కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ వెర్షన్‌లో బాహుబలి రెండు భాగాలను కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, రీమాస్టర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక వెర్షన్‌ను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి కూడా టికెట్ రేట్లు పెరుగుతాయా అన్న సందేహం ప్రేక్షకులలో ఉంది. కానీ చిత్ర బృందం తెలిపిన ప్రకారం ఎలాంటి ధరల పెంపు ఉండదని తెలుస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌ లో కూడా ఈ సినిమా సాధారణ టికెట్ ధరలకే ప్రదర్శించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles