సౌత్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆమె కుమార్తె అవంతిక ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో అవంతికకు గట్టి ఫాలోయింగ్ ఏర్పడింది. గ్లామర్ ఫోటోషూట్స్ తో ఎప్పటికప్పుడు అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం అవంతిక విదేశాల్లో చదువుకుంటున్నప్పటికీ, సినిమాల్లో నటించాలనే ఆసక్తి తనలో ఎప్పటి నుంచో ఉందని పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పటివరకు తాను నటన విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని కానీ అది తనకు చాలా ఇష్టం అని గతంలో చెప్పింది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి.
కుష్బూ భర్త సుందర్ సీ కూడా దర్శకుడు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెల్లో అవంతిక ఒకరు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పిల్లలు తెరంగేట్రం చేయడం సర్వసాధారణం అయ్యింది. ఇదే నేపథ్యంలో అవంతిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కుష్బూ తెలుగు చిత్రాల్లో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాంటి ఆమె కుమార్తె కూడా హీరోయిన్గా అడుగుపెడుతుందంటే, అభిమానులు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. అవంతిక ఎంట్రీ పై అధికారిక ప్రకటన రాలేదు కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం ఆమె త్వరలోనే సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.