సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ అమ్మతో కలిసి దిగిన ఫోటోను మహేష్ షేర్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మెసేజ్ ను పోస్ట్ చేస్తూ.. ‘హ్యాప్పీ బర్త్ డే అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను” అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.
కాగా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022లో కన్నుమూశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.