తెలుగు సినిమాల్లో ఎవ్వరైనా మర్చిపోలేని క్లాసిక్ అంటూ చెప్పే చిత్రాల్లో “జగదేక వీరుడు అతిలోక సుందరి” ప్రత్యేకంగా నిలుస్తుంది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా, అప్పట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మ్యాజికల్ మూవీ మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది అంటే అదో హ్యాపీ న్యూస్ లా మారింది అభిమానులకి.
ఇప్పటి టెక్నాలజీతో ఈ సినిమాను మళ్లీ 3Dలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. అంటే ఫ్యాంటసీకి మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మే 9న ఈ సినిమా గ్రాండ్గా రీలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ఆడియెన్స్లో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది.
రిలీజ్కి ముందు ప్రమోషన్లను కూడా జోరుగా ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ కలిసి ఒక ఫోటోలో కనిపించిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. వాళ్ల ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించడమే ఈ సినిమాపై ఉన్న అటాచ్మెంట్ని చూపిస్తోంది.
ఎప్పటినో వచ్చిన ఈ క్లాసిక్ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నత స్థానం కలిగి ఉంది. మళ్ళీ 3D టచ్ తో అదే సినిమా థియేటర్ లో చూడటం అనేది ఒక కొత్త అనుభూతిగా మారనుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఈ సినిమా ఈ కొత్త జనరేషన్ ఆడియెన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది.