సప్త మోక్ష పురాలు

Thursday, April 18, 2024

“అయోధ్యా, మధురా మాయా, కాశీ కంచి అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్ష దాయకా” అఖండ భారత దేశంలో అతి పురాతనమైన, పురాణ కాలంనాటి ఏడు ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి. వీటినే సప్త పురాలు అని అంటారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఈ పురాలు, ‘సప్త మోక్ష పురములు’గా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. భారతీయ పురాణాలను అనుసరించి, జీవిత చరమాంకంలో ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే పాపాలన్నీ సమిసి పోయి స్వర్గ లోక ప్రాప్తి దొరుకుతుందని హిందువుల నమ్మకం. అటు పురాణపరంగాను … ఇటు చారిత్రక పరంగాను ఈ ప్రాంతాలు దివ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. మానవుల జీవితాలపై ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తూ, అణువణువున భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత తమ బ్రహ్మణ, గురువు, బంధు తదితర హత్య దోష నివారణ కోసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి అటు పై మాత్రమే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.మానవ దేహంలో ఉన్న ఏడు చక్రాలు ఈ సప్త మోక్షపురములందు నిక్షిప్తం చేయబడి ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే పాపాలన్నీ సమిసి పోయి స్వర్గ లోక ప్రాప్తి దొరుకుతుందని హిందువుల నమ్మకం. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత తమ బ్రహ్మణ, గురువు, బంధు తదితర హత్య దోష నివారణ కోసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి అటు పై మాత్రమే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.

ఈ సప్తపురాలు, రామజన్మభూమి అయిన అయోధ్య (ఉత్తర ప్రదేశ్ )లో ‘సహస్రాకార చక్రం’ … శ్రీ కృష్ణుడి జన్మ భూమి అయిన మధుర (ఉత్తర ప్రదేశ్ )లో ‘ఆజ్ఞా చక్రం’ … హరిద్వారం (ఉత్తర ప్రదేశ్ )లో ‘విశుద్ధ చక్రం’… కాశీ (ఉత్తర ప్రదేశ్ )లో ‘అనాహత చక్రం’ … కంచి (తమిళనాడు .. శివకంచి – విష్ణుకంచి)లో చక్ర ప్రభావం చెరి సగానికి వర్తిస్తుంది. ఇక అవంతిక (మధ్య ప్రదేశ్ )లో ‘మణిపూరక చక్రం’ … ద్వారక (గుజరాత్ )లో మూలాధార చక్రం స్థాపించబడి వున్నాయి. వీటిని దర్శించడం కారణంగా మోక్షం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles